Thursday, May 16, 2024

కిడ్నాప్, అత్యాచారం డ్రామా విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య‌…

హైద‌రాబాద్ : ఘ‌ట్‌కేస‌ర్ లో కిడ్నాప్, అత్యాచారం డ్రామా అడిన బిఫార్మ‌సీ విద్యార్ధిని జీవితం విషాదంగా ముగిసింది.. రాంప‌ల్లి ఆర్ఎల్ న‌గ‌ర్‌లో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. ఆ విద్యార్ధిని తి సోమ‌వారం రాత్రి నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మృతురాలి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. విద్యార్థిని బీ ఫార్మ‌సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. అంత‌కు ముందు ఈ నెల‌ 10వ తేదీన తాను కిడ్నాప్‌కు గురయ్యాయ‌నని, అత్యాచారం చేశార‌ని బీఫా‌ర్మసీ విద్యా‌ర్థిని మొద‌ట త‌ల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి 100కు డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు టెక్నాల‌జీ స‌హాయంతో యువ‌తి ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆమెను చేర‌దీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ కేసును రెండు రోజుల పాటు సీసీ‌టీవీ ఫుటే‌జీ‌లను పరి‌శీ‌లిస్తూ చేప‌ట్టిన దర్యా‌ప్తులో కిడ్నాప్‌, రేప్‌ ఉట్టి‌దే‌నని తేలింది. తనకు కుటుం‌బ‌స‌భ్యు‌లతో ఉండటం ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్లి పోదా‌మ‌ను‌కొని కిడ్నాప్‌ డ్రామా సృష్టిం‌చింది. ఈ వివాదం నేప‌థ్యంలో విద్యార్ధిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement