Monday, May 20, 2024

కాంగ్రెస్ పోతుందని చెప్పడానికి జేసీ ఎవడు : విహెచ్

టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి పై వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. జేసీ తన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవాలని తెలంగాణలో కాదని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవడని మండిపడ్డారు విహెచ్ . జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు.

ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు కూడా తిరగబడతారని, జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే కెసిఆర్ కోవర్టుల అనిపిస్తుందని విహెచ్ ఆరోపించారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపించుకోవాలని అంత దమ్మున్న లీడర్ అయితే రాయలసీమ, అనంతపురం లో చూపించు కోవాలని తెలంగాణ లో కాదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement