Wednesday, May 15, 2024

జ‌గ‌న్ తో తిరుప‌తి వైసిపి అభ్య‌ర్ధి గురుమూర్తి భేటి…

అమ‌రావ‌తి – ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిరుప‌తి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రిని క‌లిసిన గురుమూర్తి.. త‌న‌కు ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అనంత‌రం గురుమూర్తికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి వైసిపి ఎంపి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మ‌ర‌ణించ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది..ఈ స్థానానికి ఏప్రిల్ 17వ తేదిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. టిడిపి అభ్య‌ర్ధిగా మాజీ కేంద్ర మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మీ పోటీ చేస్తుండ‌గా, బిజెపి త‌న అభ్య‌ర్దిని ప్ర‌క‌టించ‌వ‌ల‌సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement