Thursday, May 2, 2024

TS : సీఎం స‌హాయ‌నిధి అంద‌జేత‌…

కర్మన్ ఘాట్, మార్చి 30 (ప్రభ న్యూస్) ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఎంతో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వాస్తవ్యులు రమాదేవి ఆరోగ్య పరిస్థితులు బాగా లేని కారణంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెకు సీఎం స‌హాయ నిధి కింద రూ. 1.10ల‌క్ష‌లు మంజూరు కాగా వారికి అంద‌జేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఎంతో దూదపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడ్డ తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పి ఎఫ్ టి యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు జిల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement