Sunday, April 28, 2024

TS: మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది: ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి హెచ్చరించారు. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.కాగా, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా త‌మ దగ్గర ఉందన్నారు. హైదరాబాద్‌ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వినియోగిస్తోందన్నారు.

రంజిత్‌ రెడ్డిపై గతంలో రేవంత్‌ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు ?. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందన్నారు. త‌మ పార్టీ గేట్లు ఎత్తితే 48గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదన్నారు. నితిన్‌ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవమ‌న్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement