Friday, May 3, 2024

రాజన్న రాజ్యం అవసరంలే… ఏపీలో మూడు రాజధానులు అక్కడికి పో

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వై ఎస్ షర్మిల ప్రకటించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో పెను దుమారం లేచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా షర్మిల తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని బ్రాహ్మణ సంక్షేమ భవన్ అధ్యక్షుడు గిరి ప్రసాద్ శర్మ అన్నారు. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయవద్దని, రాజన్న పాలన ఇక్కడ అవసరం లేదని విమర్శించారు. ఏపీలో మూడు రాజధానులు ఉన్నాయని అక్కడ కావాలంటే మీరు వీలు అభివృద్ధి చేయాలన్నారు.

షర్మిల తెలంగాణలో సభలు సమావేశాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. షర్మిలకు తెలంగాణ నాయకులు మద్దతు ఇస్తే.. వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారన్నారు గిరి ప్రసాద్ శర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement