Saturday, May 11, 2024

తిరుప‌తి టిడిపి అభ్య‌ర్ధి ప‌న‌బాక ల‌క్ష్మీ నామినేష‌న్….

నెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. ముందుగా ఆమె నేతలు, కార్యకర్తలతో కలిసి వీఆర్సీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.. ఆమెతో పాటు నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. అప్పటికీ లొంగకపోతే వ్యాపారాలను దెబ్బతీయడం, ఎవరైనా టీడీపీకీ సానుభూతిపరులుగా ఉండి.. వ్యాపారాలు చేసుకుంటే వాటిని ధ్వంస చేయడంలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి సీఎం జగన్ పొగరు దించాలని, వైసీపీ మోసాల పాలనకు నిరసనగా.. 22 గొర్రెలకు తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెను ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి . జ‌వ‌హార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement