Friday, April 26, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా వేవ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఎంతకు తగ్గడం లేదు. ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి చాపకింద నీరుల ప్రవహిస్తోంది. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 61,178 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,367 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 14 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,248 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,34,786 కు చేరగా.. 20,06,034 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 14,044 కు పెరిగింది… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement