Sunday, May 5, 2024

వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య మూవీ

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా రంగం అలర్టయినట్లుంది. ఒక వేళ మళ్లీ లాక్ డౌన్ విధించిన లేక కేసుల సంఖ్య పెరిగిన సినిమా రంగం మీదే ఎక్కువ ఎఫెక్ట్.. దీంతో చిత్రం రంగం నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. ఏదయితే అది అవుతుంది కానీ..ఇప్పటికయితే పట్టాల మీద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావిస్తున్నాయి ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు. ముఖ్యంగా మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ ఆచార్య టీం ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందట. మెగాస్టార్ చిరంజీవి, రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో కొర‌టాల శివ త‌న టీంను అప్ర‌మ‌త్తం చేశాడ‌ట‌. క‌రోనా కేసుల నేప‌థ్యంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా షూటింగ్ వేగంగా పూర్తి చేయాల‌ని టీంకు సూచించిన‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌. కాజల్ ఇప్ప‌టికే ఆచార్య చివ‌రి షెడ్యూల్‌లో జాయిన్ అయింది. మ‌రి కొర‌టాల శివ అనుకున్న స‌మ‌యాని కంటే ముందే షూటింగ్ పూర్తి చేస్తాడేమో చూడాలి. మే 14న విడుద‌ల కానుంది ఆచార్య‌. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీ టీం కూడా ఏకదాటిగా చిత్రీకరణలో పాల్గొంటోంది…ఇదే బాటలో మరిన్ని సినిమాలు కూడా ప్రయాణిస్తున్నాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement