Monday, April 29, 2024

క‌రోనా రోజు రోజుకి విజృంబిస్తోంది. క‌రోనా బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా సినీ సెల‌బ్రిటీలే ఉన్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్, యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఇలా ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. మంచు మ‌నోజ్ కూడా రీసెంట్ గా క‌రోనా సోకింద‌ని ట్వీట్ చేశారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అర్జున్ కపూర్ తో సహా ఆయన ఫ్యామిలిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అర్జున్ కపూర్ రెండవసారి కోవిడ్ బారీన పడ్డారు. 2020 సెప్టెంబర్ లో అర్జున్ కపూర్ కి తొలిసారి కరోనా సోకింది. అప్పుడు అర్జున్ కపూర్ చికిత్స తీసుకుని కోలుకున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో పాటు.. ఆయన సోదరి అన్షులా, బాబాయ్ అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్, ఆమె భర్త కరణ్ లకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీనితో వారంతా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.దీనితో ముంబై మున్సిపల్ అధికారులు అర్జున్ కపూర్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ని శానిటైజ్ చేసి సీజ్ చేసినట్లు స‌మాచారం. అర్జున్ కపూర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుతున్న సమాచారం మేరకు కరుణ్ కపూర్ ప్రేయసి మలైకా అరోరా కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement