Thursday, May 16, 2024

కలెక్టర్‌కు వినతిపత్రం..

కందుకూరు : రామయాపట్నంలో భారీ ఓడరేవును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని కోరుతూ ప్రకాశంజిల్లా కలెక్టర్‌ పోలాభాస్కర్‌కు ఉద్యమ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కందుకూరు వచ్చిన జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌ బివి, సిపిఎం నాయకులు జి వెంకటేశ్వర్లు, జివిబి కుమార్‌, సిపిఐ నాయకులు పి.మాలకొండయ్య, బి.సురేష్‌ బాబు, ప్రజాపక్ష సంఘ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, కసుకుర్తి మాల్యాద్రి, టిడిపి నాయకులు గోచిపాతల మోషే, కె.యానాది, నల్లమోతు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement