Friday, May 17, 2024

కారులో మంట‌లు – ప్ర‌యాణీకులు సుర‌క్షితం..

చిత్తూరు జిల్లా: కుప్పం – పలమనేరు జాతీయ రహదారి గుండిశెట్టిపల్లి సమీపంలో మంచు కారణంగా స్తంభానికి కారు ఢీకొంది ..ఆ వెంట‌నే కారులో నుండి మంటలు ఎగిసిప‌డ్డాయి.. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణీకులు కారు నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. . తమిళనాడు నుండి గుడియాతంకు వెళుతున్న మార్గమధ్యంలో ఈ సంఘటన చోటచేసుకుంది. కారులో మొత్తం అయిదుగురు ప్ర‌యాణీస్తున్నారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement