Tuesday, July 23, 2024

AP: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై….ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎన్నికల సందర్భంగా వల్లూరు జరిగిన ఘర్షణ ఘటనలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై అంగర పోలీసు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

- Advertisement -

మారణాయుధాలతో తమపై దాడికి పాల్పడటంతో పాటు తమను కులం పేరుతో దూషించారని వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనా కుమారి ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేశారు అంగర పోలీసులు.మారణాయుధాలతో తమ ఇంటికి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారంటూ జనసేన ఇన్ ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ భార్య అనిత ఇచ్చిన పిర్యాదు పై మరో కేసు నమోదు అయింది. తోట త్రిమూర్తులతో పాటు మరో నలుగురిపై సెక్షన్ 352, 506, రెడ్ విత్ 34 సెక్షన్ ల కింద కేసులు నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement