Wednesday, May 8, 2024

వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్

మ‌హ‌బూబాబాద్ – వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబాబాద్‌లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శంకర్ నాయక్ సతీమణి, బిఆర్ఎస్ నాయకులు నిరస నకు దిగారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం షర్మిలను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement