Saturday, April 27, 2024

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

వరంగల్ జిల్లా మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన యువరైతు బీణబోయిన సురేష్ (33) అప్పుల బాధతో గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్చి తోట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సురేష్ ఇటీవల పంట తీవ్రంగా దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలో అయోమయంలో తన ఇంటి వెనకాల ఉన్న జామ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు సురేష్ కు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు సురేష్ తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement