Sunday, April 28, 2024

TS: ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మ‌హ‌త్య‌..

ఆర్థిక ఇబ్బందులతో ఓ కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్‌కు చెందిన తడక శ్రీనివాస్ అనే పవర్‌లూమ్ కార్మికుడు నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నాడు. మృతుడికి భార్య లావణ్య ఇద్దరు కూతుళ్లు అనూష (18) అక్షయ (16) ఉన్నారు.

తడక శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో గత ఏడేళ్లుగా భార్య లావణ్య పిల్లలతో వేరుగా ఉంటుంది. మద్యానికి బానిసైన మృతుడికి మూడు నెలలుగా ఉపాధి లేకపోవడంతో కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులకు గురై చివరికి మందులు లేని స్థితిలో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement