Sunday, April 28, 2024

National : దేశ వ్యాప్తంగా 30చోట్ల ఎన్ఐఏ త‌నిఖీలు

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు 30చోట్ల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు చేప‌ట్టారు. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు జరుపుతున్నారు.

- Advertisement -

ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో భాగం అయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కాగా, జనవరి ఆరో తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టిం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement