Sunday, April 28, 2024

TS : ఈనెల 15,16న రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి రాక..

ఈనెల 15,16వ తేదీల‌లో రాష్ట్రంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్ర‌ప‌తిలు ప‌ర్య‌టించ‌నున్నారు. 15న రాష్ట్ర‌ప‌తిద్రౌపది ముర్ము, 16న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్రానికి రానున్నారు. వారి ప‌ర్య‌ట‌న‌కు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారుల‌ను ఆదేశించారు.

బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ఆదేశించారు. విమానాశ్రయం, రాజ్‌భవన్‌తో పాటు ఇతర వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు, సహాయక సిబ్బంది, మహిళా వైద్యులు సేవల్ని అందుబాటులో ఉంచాలని చెప్పారు. రాష్ట్రపతి కాన్వారు వెళ్లే మార్గాల్లో రోడ్ల మరమ్మతుల్ని కంటోన్మెంట్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో చేపట్టాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement