Thursday, May 16, 2024

Women reservation bill – ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్)19:* ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్లో మహిళా రిజర్వే షన్ బిల్లు ఆమోదం పొందిందని… మహి ళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ముందు ఉంటారని మహిళా నేతలు, జాగృతి నాయకులు అన్నారు. మహి ళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా విశేషంగా కృషి చేస్తున్న కవిత కి ధన్యవాదాలు తెలిపారు.. కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళల ప్రజా ప్రతిని దులు ముందుకు వచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు..

నిజామాబాద్ నగరంలో భారత్ జాగృతి అధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం వద్ద మంగళ వారం కవిత చిత్రప టానికి విద్యార్తినులు మహిళా నేతలు… జాగృతి నాయకులు క్షీరాభిషేకం చేశారు.మొదట కేసీఆర్ కామన్ నుండి క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ గా తరలి వచ్చి క్షీరాభి షేకం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మొదటి నుంచి పోరాడుతున్న కవిత కి కృతజ్ఞతలు తెలి పారు.. ఇది యావత్ మహిళా లోకం విజయంగా అభివర్ణిం చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు అపర్ణ ,సుమన రెడ్డి,విశాలిని రెడ్డి,భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు,నరాల సుధాకర్ ,లక్ష్మి నారా యణ , బిఆర్ఎస్ యువ నాయకులు చిన్ను గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement