Saturday, April 27, 2024

TS: పెళ్లి ట్రాక్ట‌ర్ బోల్తా.. ముగ్గురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు

పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మ‌రో 20మందికి తీవ్ర గాయాలైన ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగింది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అంబులెన్సులకు ఫోన్ చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసుల క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement