Monday, May 20, 2024

Water War – కృష్ణా జ‌లాల‌పై తెలంగాణ , ఆంధ్ర సిగ‌ప‌ట్లు – జ‌ల‌జ‌గ‌డం ఇంకెన్నాళ్లు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సరిగ్గా ఎన్నికల సమయం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ మొద లైంది. కృష్ణా నదీ జలాలే కేంద్రంగా ఈ వివాదం రాజుకుం టోంది. వాటాల్లో స్పష్టత లేక ప్రతియేటా ఇదే సమస్య పునరా వృతమవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జగిరిన ఏడాది 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాల మధ్య సయోధ్య ఏనాడూ కుదరలేదు. నీటి కేటాయింపుల్లో ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రతియేటా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. చట్టాలు, తీర్పులు, ఒప్పందాలన్నీ ఉల్లంఘనకు గురవుతున్నది ఏపీ లొ నేనని, వివాదాలు పరిష్కారం కాకుండా నీటి వినియోగం ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో కృష్ణా నదీ జలాల యాజ మాన్య బోర్డు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్ప టికే అనేక పర్యాయాలు ఇరు రాష్ట్రాల ఇండెంట్లను పట్టిం చు కోని యాజమాన్య బోర్డు ఇప్పటికీ సమస్యను నాను స్తూనే ఉం ది. ఈ నిర్లక్షాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగ ణి స్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. ఫలి తంగా రాష్ట్ర విభ జన జరిగిన కొత్తలో కుదిరిన రాతపూర్వక ఒప్పందాల ఉల్లం ఘన.. నేటికీ అపరిష్కృతంగా మిగిలి పోయింది.

రాష్ట్ర పునర్విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక ఏడాదికి మాత్రమే పరిమితమని తెలంగాణ వాదిస్తోంది. 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల పున: పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని డిమాండ్‌ చేస్తోంది. శ్రీశైలం నుంచి 34 టీ-ఎంసీలకు మించి వినియో గించుకునేందుకు ఏపీకి హక్కులు లేవు.. అయినా శ్రీశైలం జలాలను కృష్ణా బేసిన్‌ అవతలకు ఏపీ తరలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో 20శాతం తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పి నా అమలు కావటం లేదు. నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాల్సి ఉంటుంది. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976-77లో కుదుర్చుకున్న ఒప్పందాలకు లోబడి నిబం ధన లు ఖరారు చేసి అమలు చేయాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల వద్ధ జలవిద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన నిబం ధనలను సవరణ చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్‌లోని ఆల్మట్టి, నారా యణపూర్‌, జూరాలకు భారీగా వరద రావడంతో పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కానీ శ్రీశైలంకు కొంత నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేదు. దీంతో నాగార్జునసాగర్‌ జలాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది తాము విని యోగించుకోకుండా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో పొదుపు చేసిన 18 టీ-ఎంసీల నీళ్లు ఉన్నాయని, ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని తెలంగాణ చెబుతోంది.

ఈ నీటిని క్యారీ ఓవర్‌ కింద తాము ఈ నీటి సంవత్సరం 2023-24లో తొలి సీజన్‌లో తాగు,సాగునీటి అవసరాలకు వాటిని వినియోగించుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి గత ఏడాది నిల్వను ఇప్పుడు వినియోగించుకుంటు-న్నందున దీన్ని ఈ ఏడాది కోటా కింద పరిగణించవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ 18 టీఎంసీల నీటిని వాడుకోవడం ద్వా రా ఏపీ నీటి హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలంగాణ నీటి పారుదల అధికారులు లేఖలో పేర్కొన్నారు. తాము వాడు కోకుండా పొదుపు చేసిన కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ జలాశయాలు లేకపోవడంతో 2023-24 నీటి సంవత్సరానికి సంబంధించిన తాగు, సాగు నీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో అదనపు కేటాయింపులు
చట్ట ప్రకారం బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం బచావత్‌ పంపిణీ చేసిన 811 టీ-ఎంసీలకు అదనంగా కొత్తగా నీటి లభ్యతను గుర్తిస్తే ఆ జలాలను పంపిణీ చేయటానికి మాత్రమే పరిమితమవుతుంది. కొత్తగా నీటి లభ్యతను గుర్తించినందు వల్లనే విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలుగుగంగ విస్తర ణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీనీవాకు 40, వెలి గొండ కు 43.50 టీ-ఎంసీలు.. మొత్తం 150.50 టీ-ఎంసీలు కేటా యించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నెట్టెంపాడుకు 22 టీ-ఎంసీలు.. మొత్తం 47 టీ-ఎంసీలు కేటాయించారు. దీనిపై తెలంగాణకు స్పష్టత ఉన్నా వివాదం రగలించటం ద్వారా కృష్ణా జలాల్లో అదనపు ప్రయోజనం పొందేందుకు ప్రయ త్ని స్తోందని ఏపీలోని నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

ఏపీ దూకుడుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
2023-24 నీటి సంవత్సరంలోనూ కృష్ణాలో 66:34 శాతానికి కట్టు-బడి పర్యవేక్షణ చేపట్టాలనీ, నిర్వహణ, నియ మావళిని ఖరారు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా మార్గనిర్దేశం చేసింది. రిజర్వా యర్లు, సాగుయోగ్యమైన భూమి, నీటిపారుదలకు అవకాశ మున్న స్థిరీకరణ ఆయకట్టు-ను అనుసరించి బచావత్‌ ట్రిబ్యు నల్‌ కృష్ణా జలాల్లో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం కేటాయింపులు చేసింది. గతేడాది ఏపీకి కేటాయించిన నీటి వాటాకు మించి 51.745 టీ-ఎంసీల కృష్ణా జలాలను వినియో గించిందని తెలంగాణ సర్కార్‌ ఆరోపించింది. సాగర్‌ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీ-ఎంసీలు మా త్రమే కృష్ణా రివర్‌ బోర్డు కేటాయించిందని, తాగునీటి అవస రాల కోసం నాగార్జునసాగర్‌లోని 5 టీఎంసీల నీళ్లను కేటా యించాలని గత నెలలో ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022-23లో 205 టీఎంసీలను, 34:66 నిష్పత్తిలో 51 టీ-ఎంసీలను ఏపీ ఎక్కు వగా వాడుకుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అదనంగా వినియోగించుకున్న 51టీఎంసీలను ఈ సంవత్స రపు ఏపీ నీటి కోటా నుంచి మినహాయించాలని బోర్డును తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ- సమావేశంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుని నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డును తెలంగాణ కోరింది.

2014 నాటి రాతపూర్వక ఒప్పందాలు ఉల్లంఘన
2014 రాష్ట్ర పునర్విభజన అనంతరం కేంద్ర జలశక్తి సమ క్షంలో రెండు రాష్ట్రాల మధ్య రాతపూర్వక ఒప్పందాలు కూడా కుదిరాయి. తెలంగాణ మాత్రం ఆ ఒప్పందాలను తిరగ దోడాలనీ, కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పున:పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. పున:పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని కూడా వాదిస్తోంది. ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు- హామీతో గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరిం చుకున్నప్పటికీ పున:పంపిణీ చేసి తీరాలని పట్టుబడుతోంది. తెలంగాణ వాదనపై సమగ్ర అధ్యయనం చేయటమే కాకుండా న్యాయ నిపుణులతో చర్చించిన కేంద్ర జలశక్తి శాఖ పున: పంపిణీ సాధ్యం కాదని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చిం ది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌-1 అవార్డును అనుసరించి 66:34 నిష్పత్తి మేరకే కేటాయింపులుంటాయని కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది.

పాత ట్రిబ్యునళ్ళ ఆదేశాలను పున:సమీక్షకు నో చాన్స్‌
అదనపు జలాల కోసమే బ్రజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆదె శాలు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. అందువల్లనే బచావత్‌ తరువాత బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వచ్చినా పాత్ర ట్రిబ్యునల్‌ ఆదేశాలను తిరగదోడలేదని ఏపీ గుర్తు చేస్తోంది. అంతర్‌ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్టంలోని సెక్షన్‌6 (2) ప్రకారం కొత్త ట్రిబ్యునళ్ళు పాత ట్రిబ్యునల్‌ ఆదేశాలను పున: సమీక్షిం చటానికి ఏర్పడవు. అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరి ష్కారం, కొత్తగా అందుబాటు-లోకి వచ్చిన జలాలను పంపిణీ చేయటానికే కొత్త ట్రిబ్యునళ్ళు పనిచేస్తాయి. అందువల్లనే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటు-లోకి వచ్చే 163 టీ-ఎంసీలు, వరదల సమయంలో సమకూరే 285 టీ-ఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం కలిపి 448 టీ-ఎంసీలను ఏపీ, తెలం గాణ, కర్ణాటకలకు పంచే విషయానికే పరిమితమైందని నిపుణులు చెబుతున్నారు.

21న త్రిసభ్య కమిటీ భేటీ
తెలంగాణ, ఏపీలకు ఆగష్టు, సెప్టెంబరులకు నీటిని కేటాయించేందుకు ఈ 21న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ- సమావేశాన్ని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు- చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఉన్న నీటి నిల్వలు, వినియోగంపై త్రీమెన్‌ కమిటీ- చర్చించనుంది. శ్రీశైలం నుంచి ఆగస్టు చివరి వరకు తాగు, సాగు నీటి అవసరాలకు 16 టీ-ఎంసీ లను కేటాయించాలంటూ ఏపీ.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఇండెంట్‌ పెట్టింది. రెండు రాష్ట్రాల ఇండెంట్లపై తమ అభిప్రాయాలను తెలపాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. మొత్తానికి మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల జగడం ఎటు- దారితీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement