Wednesday, May 1, 2024

యాదాద్రి దేవాలయం అద్భుతం : మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి లతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మా ఇలవేల్పు.

గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చుస్తే యాదాద్రి కేనా వచ్చింది అన్నంత అభివృద్ధి జరిగిందన్నారు. ప్రపంచం అబ్బుర పడేలా ప్రఖ్యాత దేవాలయంగా యాదాద్రిని సీఎం తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. సీఎం కేసీఆర్ దార్శనికత తో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. అంతకు ముందు మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులుస్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించి.. స్వామి వారి ప్రసాదం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement