Wednesday, May 15, 2024

తరుగు తండ్లాటతో రోడ్డెక్కిన రైతులు..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మోగ్దుంపురం గ్రామ పరిధిలో నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారి పైన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు ఎక్కువ తీస్తున్నారనే కారణంతో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహిస్తున్నారు. క్వింటాలకు సుమారుగా 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను నిలువ దోపిడీ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు ..అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తరుగు తండ్లాటను తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.రైతుల ధర్నాతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement