Tuesday, May 7, 2024

గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి : సీపీఎం నేత చక్రపాణి

వడ్డేపల్లి, ఏప్రిల్ 18(ప్రభ న్యూస్) : హనుమకొండ మండలం పెగడపల్లి రింగ్ రోడ్ పలివెల్పుల సర్వే నెంబర్ 288లో కోమటి కుంటలో ఏడాది కాలంగా గుడిసెలు వేసుకున్న జీవో నెంబర్ 58 ద్వారా నిరుపేదలకు పట్టాలిచ్చి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని సీపీఎం పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుడిసె వాసుతో కలిసి సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. చక్రప్రాణి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చకపోవడంతో, గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి పొట్ట కూటికోసం పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ధర్నాలో సీపీఎం నాయకులు రవి, రాములు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement