Sunday, May 19, 2024

AP : ష‌ర్మిల పై కేసు న‌మోదు

షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న ప్రసంగాల్లో పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారని ఆమెపై కేసు నమోదైంది. వైఎస్సార్‌ జిల్లాలోని బద్వేలు పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా ఆమె తరచూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తుండటంతో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement