Sunday, May 19, 2024

bihar : పోలింగ్ లో బూత్ లో ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మృతి

సార్వత్రిక సమరంలో ఇవాళ మూడో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో విషాదం చోటుచేసుకుంది. బిహార్లోని సుపాల్ పోలింగ్లో బూత్ లో ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. సదరు అధికారిని శైలేంద్ర కుమార్గా గుర్తించారు.

‘శైలేంద్ర కుమార్ ఈరోజు ఉదయం చనిపోయారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన్ను సిబ్బంది వెంటనే హీహెచ్సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టంలో ఆయనకు షుగర్ ఉన్నట్లు తేలిందని ఓ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement