Monday, May 6, 2024

26న‌ ఏఈ పరీక్షల ధృవపత్రాల పరిశీలన..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: వరంగల్‌లోని ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ సహాయక ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షల్లో మెరిట్‌ విద్యార్థుల ధృవపత్రాలను సోమవారం నాడు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్‌ భవన్‌ కార్పోరేట్‌ కార్యాలయంలో పరిశీలిస్తారని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు.

వరంగల్‌ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 82 సహాయక ఇంజనీర్ల పోస్టుల భర్తీకి గాను జూన్‌లో నోటిఫికేషన్‌ జారీ చేయగా ఆగస్టు 14న పోటీ పరీక్షలు జరిగాయి. మెరిట్‌ ప్రాతిపదికన ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు సం స్థ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 26న అభ్యర్ధులు తమ ధృవపత్రాలను తీసుకొని హనుమకొండకు రావాలని గోపాల్‌రావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement