Friday, April 26, 2024

ఆర్టీసి బస్సు, ద్విచక్ర వాహనం ఢీ..

  • తీవ్ర గాయాలైన ఇద్దరు యువకులు
  • డిగ్రీ కాలేజ్ విద్యార్థులుగా గుర్తింపు
  • బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఘటన
    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నెక్కొండ రోడ్డులో ఆర్టీసి బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొనగా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో గుడ్డేలుగుల పల్లీ గ్రామానికి బల్లె నాగరాజు కు కుడి కాలు తీవ్రంగా గాయపడగా, మల్లంపల్లి గ్రామానికి చెందిన వెండి గణేష్ కు కుడి కాలు దెబ్బతిన్నది. ఇద్దరు క్షత గాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement