Wednesday, May 8, 2024

పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ.. 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌-పీజీ-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు పీజీ డిప్లొమా/డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజ మాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఈనెల 5వ తేది ఉదయం 8 గంటల నుంచి 12వ తేది సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.

నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement