Saturday, April 27, 2024

AP: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభ‌త్సం.. గొర్రెల కాప‌రిని తొక్కి చంపేశాయి

చిత్తూరు జిల్లాలో ఘోరం జ‌రిగింది. పెద్దపంజాణి మండలంలో గొర్రెల కాప‌రిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో పెద్దకాపల్లిలోని జిట్టంవారిపల్లికి చెందిన గొర్రెల కాపరి కమతం గంగయ్య(72) చ‌నిపోయాడు. జిట్టంవారి పల్లి గ్రామానికి చెందిన గంగయ్య గ్రామ సమీప ప్రాంతాల్లో మంగళవారం గొర్రెలు మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏనుగుల మంద‌ దాడి చేసి, తొక్కి చంపిన‌ట్టు గ్రామ‌స్తులు తెలిపారు. ఏనుగుల గుంపుని చూసి భయంతో దాదాపు సాయంత్రం వరకు స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఫారెస్ట్ అధికారుల సాయంతో అక్క‌డికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement