Wednesday, May 15, 2024

మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికారులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన సంఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు విచారణ జరిపారు. మహబూబాబాద్ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంబరీష, తహసీల్దార్ ఎం.అశోక్ కుమార్, ఏటిడివో భాస్కర్, ఎంపీడీవో విజయలక్ష్మి, డాక్టర్ సాయినాథ్ తదితరులు సందర్శించారు. వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. సంఘటన జరగడానికి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వార్డెన్, వర్కర్ల నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement