Sunday, May 19, 2024

Karnataka : 2023నాటికి ఆరేళ్లు నిండితేనే – ఒక‌టో త‌ర‌గ‌తి ప్ర‌వేశానికి అర్హ‌త‌

2023 జూన్ నాటికి ఆరు సంవ‌త్స‌రాలు నిండితేనే ఒక‌ట‌వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి అర్హ‌త ల‌భిస్తుంద‌ని క‌ర్ణాట‌క విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్పటి వరకు ఒకటో తరగతి చదివేందుకు ఐదేళ్ల ఐదు నెలలు ఉంటే సరిపోయేది. ఈ కొత్త నిబంధన అటు తల్లిదండ్రులనే కాదు, టీచర్లు, పాఠశాలలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రీ స్కూల్స్ అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. మా బాబు జులైలో జన్మించాడు. ఇప్పుడు అతడ్ని ఒకటో తరగతిలోకి అనుమతిస్తారా? లేదంటే మరోసారి అదే తరగతి చదవమంటారా అని ఓ తండ్రి బాధను వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఒక ఏడాది విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని సమర్థించే వారూ ఉన్నారు. ‘‘చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంకా మానసికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధం కాకముందే గ్రేడ్ 1లో చేర్చాలని చూస్తుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వారిపై ఒత్తిడిని తగ్గిస్తుందని 50వేల మంది సభ్యులతో ఫేస్ బుక్ గ్రూపు నడుపుతున్న స్వేతా శరణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement