Thursday, May 2, 2024

డ్రోన్ కెమెరాలతో బాంబుల దాడి – ఖండించిన మావోయిస్టులు

వరంగల్ క్రైమ్ – ఛత్తీస్ గఢ్ లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు బాంబుల దాడికి పాల్పడటంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షిణ బ్యూరో స్పందించింది. ఈ మేర‌కు ఒక లేఖ‌ను, డ్రోన్ ఫోటోల‌ను విడుద‌ల చేసింది. మావోయిస్టు నక్సల్స్ ను హతమొందించేందుకు చేస్తున్న కుట్రలలో భాగంగా టెక్నాలజిని ఉపయోగించుకొని , డ్రోన్ కెమెరాలతో నక్సల్ కదలికలను తెలుసుకొనే ప్రయత్నం చేయడం తో పాటు, నక్సల్స్ మొత్తంను మట్టుపెట్టేందుకు పోలీసులే డ్రోన్ల తో బాంబుల దాడికి తెగబడ్డారంటూ ఆరోపించింది. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేసిన డ్రోన్ దాడులను బస్టర్ ఐ జి సుందర్ రాజ్ చేసిన ఆధారం లేని ఆరోపణలు ఖండించాలని లేఖలో కోరారు. డ్రోన్ల తో బాంబుల దాడికి పాల్పడ్డ ఘటనపై మధ్యవర్తులను దాడి జరిగిన ప్రాంతానికి పంపి,నిజానిజాలను నిగ్గు తేల్చి, అసలు వాస్తవ విషయాలను బయటకు తీసుక రావాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంశాఖ ,మంత్రి ప్రధాన మంత్రి సలహాదారు విజయ్ కుమార్,ఆపరేషన్స్ డిజిపి అశోక్ ఆపరేషన్ల పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రోన్ల సహాయంతో దాడి జరిగిన ప్రాంతానికి విలేకరులు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించి,వాస్తవ విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలుయజేయాలని కోరారు.కాగా, ఏప్రిల్ 19న మావోయిస్టు పి ఎల్ జి ఎ పడగొట్టిన 2 డ్రోన్లను చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకొనే చర్యలను మావోయిస్టు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement