Monday, May 13, 2024

బాధిత‌ జర్నలిస్టు కుటుంబానికి మంత్రి ఈట‌ల పరామ‌ర్శ …

కమలాపూర్ జర్నలిస్టు గట్టు మహేందర్ ఇటీవల మరణించారు.. విష‌యం తెలుసుకున్న మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేందర్ స్వగ్రామమైన వంగపెళ్లి కి వెళ్లిన మంత్రి ఈటల రాజేందర్ మహేందర్ ఎలా మృతిచెందాడని తెలుసుకొని అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ తరఫున మహేందర్ కుటుంబానికి రావలసిన ఆర్థిక సహాయం తో పాటు అతని భార్యకు పెన్షన్ వచ్చే విధమైన చర్యలు తీసుకుంటామని మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement