Sunday, May 19, 2024

కుల చిచ్చు… ప్రేమ జంట ఆత్మహత్య

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.తాజాగా ఒంగోలు పట్టణంలోని పెళ్లూరు గ్రామ సమీపంలో చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదని అందుకే ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఇక అబ్బాయి మద్ది వెంకట సాయి వైశ్య కులానికి చెందిన వాడు.

అమ్మాయి గౌడా కులానికి చెందిన అమ్మాయి గా సమాచారం. అయితే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. వారం రోజుల క్రితం చీమకుర్తి పోలీస్ స్టేషన్ కు రక్షణ కల్పించమని అడిగినట్టు కూడా సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement