Thursday, July 25, 2024

MBNR : ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా

మహబూబ్ నగర్, మే 13 (ప్రభ న్యూస్): టీచర్స్ కాలనీలోని బూత్ నెం 113 బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత‌కుముందుమహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ తిరుమలనాథ స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ…మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రతి ఓటరు పండుగలా భావించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగే విధంగా రాజ్యాంగ పునాదులు మరింత పటిష్టత కోసం సంక్షేమం,అభివృద్ధి ఫలాలను అందిస్తున్న రాష్ట్ర సుపరిపాలనను ఆశీర్వదించేలా పాలమూరు ప్రజల ప్రగతి కోసం భాద్యతతో భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ఆకాంక్షించి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని అయన పిలుపునిచ్చారు. ఆతరువాత పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ద్విచక్ర వాహనంపై వెళ్లి స్వయంగా పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement