Tuesday, April 30, 2024

పూల కోసం చెరువులో దిగి వ్య‌క్తి మృతి…

ఏటూరునాగారం : సద్దుల బతుకమ్మ పండుగకు పూలు తెచ్చేందుకు ఒ వ్య‌క్తి చెరువులోకి దిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దికుంట మండలం సుల్తానాబాద్ జిల్లా కరీంనగర్ నివాసి వీరవేణి శ్రీను(28) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలోని అత్తగారింటికి వెళ్లాడు. బావమరిదితో పూల కోసం మండలంలోని చల్పాక మాటుకుంట చెరువులో దిగి కొంత దూరం వెళ్లి తిరుగు ప్రయాణ క్రమంలో కాళ్లకు గడ్డి చుట్టుకొని ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement