Friday, May 17, 2024

ఇండియాలో కొత్త‌గా 3011 క‌రోనా కేసులు..

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.. రోజురోజుకు క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తాజాగా.. దేశంలో కొత్తగా 3011 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. ఇందులో 4,40,32,671 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నాయి. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాకు బలయ్యారు. మరో 36,126 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 28 మంది మరణించగా, 4301 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.08 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.2 శాతం ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement