Friday, May 24, 2024

బైక్‌ను ఢీ కొట్టిన లారీ : ఇద్దరు మృతి

జనగామ : జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం చింతబావి తండా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట – జనగామ హైవేపై చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన కథనం మేరకు..సూర్యాపేట నుంచి జనగామ వైపున‌కు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని జనగామ నుంచి సూర్యాపేట వైపు వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు విజయవాడ దగ్గర కన్నూరు గ్రామానికి చెందిన ఉప్పుడు వంశీగా గుర్తించారు. మరొక మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు..పూర్తి వివరాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement