Sunday, May 5, 2024

యాదాద్రిలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారిని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. రేపటి నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ఉండటంతో..యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

కాగా, అంతకు ముందు యాదగిరిగుట్టలో బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కార్లను గుట్ట మీదకు అనుమతించడం లేదని… దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులోనే వెళ్లాలని నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement