Saturday, April 27, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ : ఇద్ద‌రు మృతి

బైక్ ను లారీ ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వరంగల్- ఖమ్మం హైవేపై లారీ బైక్ ను ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే చనిపోయారు. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ మేరకు.. ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారులో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు వరంగల్ శివనగర్, కాశిబుగ్గకు చెందిన పోలేపాక వినయ్(27), చిన్నపల్లి ప్రదీప్(17) గా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement