Saturday, April 27, 2024

TS: క‌డియం వ‌చ్చారు.. జ‌ర జాగ్ర‌త్త.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతలు హిత‌వు

పార్టీ మారిన క‌డియం పై వ‌రంగ‌ల్ నేత‌లు గ‌రంగ‌రం
అప్పుడు చంద్ర‌బాబుని, ఇప్పుడు కెసిఆర్ ను
బ్లాక్ మెయిల్ చేసిన నేత అంటూ ఆరోప‌ణ‌లు
ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్
క‌డియం కోసం ఎంతో మంది నేత‌ల‌ను వ‌దుకున్న కెసిఆర్
కృత‌జ్ఞ‌త లేని క‌డియం అంటూ ఆగ్ర‌హం

వ‌రంగ‌ల్ – కడియం శ్రీహరి పార్టీ మార్పు పై బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికారు. టీడీపీలో పని చేసిన సమయంలో చంద్రబాబును బ్లాక్ మెయిన్ చేసి పదవులు తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిస్వార్థంతో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే.. బీఆర్ఎస్ లో అదే విధానాలు అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ లో ఉన్న విజయరామారావు, దొమ్మాటి సాంబయ్య, ఎంపీ దయాకర్, అరూరి రమేష్, రాజయ్యలను బయటకు వెళ్ళేలా చేశారు కడియం శ్రీహరి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేసి పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నిజాయితీపరుడు అయితే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కడియం సీనియార్టీని గౌరవించి డిప్యూటీ సీఎం చేస్తే ఇంతటి దిగజారుడుకు పనికి చేస్తావా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పార్టీలు మాట్లాడుతున్న మోసం చేసిన కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్యాకేజీ మాట్లాడుతున్న కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement