Saturday, April 27, 2024

TS: కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయి.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంకా మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మే కేసీఆర్ చేసిన మొద‌టి త‌ప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కేసీఆర్‌ చేసిన పాపాల వ‌ల్ల క‌రువు వ‌చ్చింద‌న్నారు. అలాగే యాద‌గిరి గుట్ట‌లో భారీ స్కామ్ జ‌రిగింద‌ని మంత్రి ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత విచార‌ణ చేస్తామ‌ని తెలిపారు. అంతేగాక‌ యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌ని చెప్పారు. గేట్లు తెర‌వ‌క‌ముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వ‌స్తున్నార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం త‌ప్ప ఎప్పుడూ పార్టీని వ్య‌తిరేకించ‌లేద‌న్నారు. టికెట్ల విష‌యంలో తాను క‌లుగ‌జేసుకోన‌ని, పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ల కోస‌మే ప‌నిచేస్తానని మంత్రి కోమ‌టిరెడ్డి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement