Friday, May 3, 2024

JEE : ఇవాళ్టి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు..

ప్రతిష్ఠాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ -2024కు దరఖాస్తు నమోదు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానుంది.ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది.

- Advertisement -

అభ్యర్థులు మే 7 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉంది. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. జేఈఈ మెయిన్ ర్యాంకులు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్కు హాజరైన వారిలో నుంచి 2. 5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. క్యాటగిరీ వారీగా కటాఫ్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. వీరంతా జేఈఈ అడ్వాన్స్డ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement