Sunday, May 19, 2024

తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి

మొగుళ్లపల్లి (ప్రభన్యూస్): జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో సోమవారం ఉదయం గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి కల్లుగీసే క్రమంలో ప్రమాద వశాత్తు చెట్టు పైనుండి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆకినపల్లి గ్రామానికి చెందిన గండు దేవయ్య (40) అనే గీతా కార్మికుడు కులవృత్తిలో భాగంగా తాటిచెట్టు పై ఎక్కి కల్లుగీసే క్రమంలో మోకు జారీ కింద పడిపోవడంతో దేవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు మొగుళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement