Monday, May 6, 2024

పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన దగ్గర ఉన్న సమాచారం అధారంగా వారికి కర్తవ్య బోధన చేయనున్నారు. మన భవిష్యత్ క్యాంపెయిన్ పై పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement