Sunday, April 28, 2024

గిరిజ‌నుల సంక్షేమానికి పెద్ద‌పీట : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గిరిజ‌నుల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తుంద‌ని, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డార‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజల పాలిట వరంగా మారాయ‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి పాలాభిషేకం చేశారు. ఆయ‌న వెంట ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement