Saturday, April 20, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 268.400 గ్రాముల బంగారం పట్టివేత

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు. దాదాపు 268.400 గ్రాముల బంగారంను అధికారులు సీజ్ చేశారు. మహిళను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.13 లక్షలు 73 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement