Friday, May 3, 2024

AP : చెత్త సీఎంగా జ‌గ‌న్ … గంటా శ్రీ‌నివాస‌రావు

విధ్వంసంతో పరిపాలనకు నాంది పలికిన చెత్త సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఘనతకెక్కాడని భీమునిపట్నం తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడలో ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆయ‌న మాట్లాడుతూ ఇటీవల కుసులవాడ పంచాయతీ తెదేపాలో చేరడం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందన్నారు.


మండలంలోని అత్యధిక మెజార్టీ ఈ గ్రామం నుంచి వస్తే గ్రామాన్ని దత్తత స్వీకరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. స‌మాజంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలచేసామన్నారు. సంపద సృష్టించడం తెలిసినవారికి సంక్షేమ పథకాలు ఇవ్వడం కష్టంకాదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమయం కష్టకాలంలో కూడా సంక్షేమం – అభివృద్ధి రెండు కళ్లలా ముందుకు సాగించారన్నారు. వరదలు వస్తే పైన హెలికాప్టర్లో చూసి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గులక రాయితో హత్యా ప్రయత్నం చేశారని జగన్మోహన్ రెడ్డి హైడ్రామా ఆడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement