Tuesday, March 26, 2024

గిరిజన ‘బంధు’వు సీఎం కేసీఆర్ : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

గిరిజన రిజర్వేషన్ల కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మ‌ర్ష‌ణీయ‌మ‌ని, గిరిజ‌న ‘బంధు’వు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, పలువురు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ 10% శాతం పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆలోచించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నద‌ని భావించిన సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు మాదిరిగా పేద గిరిజనుల గిరిజన బంధు పథకాన్ని ప్రకటించడం సంతోషకరమన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న కలలను సీఎం కేసీఆర్ ప్రకటనలతో సహకారమైంద‌న్నారు. ఈ పథకం గిరిజన జీవితాలలో వెలుగులు నింపునున్నద‌ని, ఉమ్మడి రాష్ట్ర పాలకులు కారణంగా గిరిజనలు ఇబ్బందుపడ్డార‌న్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు పథకాలను సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్నారు. గిరిజన బంధును ప్రకటించడం సంతోషంగా ఉంద‌ని, గిరిజన బాంధవుడు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సంక్షేమలకు ప్ర‌భుత్వం పెద్దపీట వేస్తుంద‌న్నారు. అడవి భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆకుపత్రాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రైతు బంధు రైతు బీమా ఐటీడీఏ పథకాలు గిరిజనలకు ప్రయోజనంగా చేకూరుతున్నాయని అన్నారు. పినపాక నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఆదివాసి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి నాయకులు మాట్లాడుతూ… గిరిజనలు ఉపాధి మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకం అమలు చేయడం చారిత్రకమైంది, గత ప్రభుత్వాలు గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేద‌న్నారు. దీంతో జిల్లాలోని గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వచ్చింద‌ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గిరిజన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం సంతోషదాయకమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement